స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం!

గోదావరిఖని పారిశ్రామిక పట్టణంలోని మార్కండేయ కాలనీ వాణి విద్యా విహార్ హై స్కూల్ లో చదువుకున్న గోదావరిఖని సప్తగిరి కాలనీకి చెందిన చేపూరి సురేందర్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తూ ఫిబ్రవరి నెలలో మృతి చెందాడు ఆయనతో చదువుకున్న పూర్వ విద్యార్థులు కలిసి 1,04,101 ఒక లక్ష నాలుగువేల ఒక వంద ఒక రూపాయిల ఆర్థిక సహాయం గురువారం సురేందర్ నివాసానికి వెళ్లి కూతురు చైత్ర కు అందజేశారు ఇట్టి నగదును చైత్ర పేరుపై పోస్ట్ ఆఫీస్ లో ఫిక్సిడ్ డిపాజిట్ చేయించాలని ఆయన కుటుంబ సభ్యులను కోరారు ఈ కార్యక్రమంలో ఆయన స్నేహితులు మర్రి నవీన్ కుమార్, లక్ష్మీనారాయణ, శివ కుమార్, సుభాన్, బిక్షపతి, రమేష్, సత్యనారాయణ, శారద వాణి విద్యా విహార్ పూర్వ విద్యార్థులు తదితరులు ఉన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *