సింగరేణి అధికారులపై సిబిఐ విచారణ చేయించాలి

రామగుండం ఏరియా_2 ఓసిపి3, బేస్ వర్క్ షాప్ లో కార్మిక చైతన్య యాత్ర … సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ ద్వారా సమావేశం నిర్వహించారు ..

మాజీ శాసనసభ్యులు, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమవారపు సత్యనారాయణ , SCMKS-BMS …అధ్యక్షులు యాదగిరి సత్తయ్య పాల్గొని మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా కార్మిక చైతన్య యాత్రకు బ్రహ్మరథం …పడుతున్న సింగరేణి కార్మికులకు, కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపినారు… ఏప్రిల్ 18 నుండి మే 8తారీకు వరకు, గోలేటి నుండి సత్తుపల్లి వరకు సాగుతున్న కార్మిక…. …చైతన్య యాత్ర ప్రధానమైన డిమాండ్ పరిష్కారం చేయాలని వేలాది కోట్ల కుంభకోణాలకు పాల్పడుతున్న సింగరేణి అధికారులపై సీబీఐ ద్వారా విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిరు,..
ఆర్థిక కుంభకోణాలను నివారించుటకు ఈ సంస్థకు సంబంధించిన పాలన అంశాలలో మార్పు తీసుకురావాలని డిమాండ్ చేసారు ….సింగరేణిలో పెరిగిన రాజకీయ జోక్యం రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం సంస్థ పెనుభారం పడుతున్న ఆర్థిక విషయాలలో నిధుల మళ్లింపు అరికట్టుటకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినారు….సొంత ఇంటి పథకం అమలు చేయుటకు 250….గజాల భూమి 50 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం తక్షణమే ఇచ్చుటకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేసారు… కోల్ ఇండియాలో చెల్లిస్తున్నట్లుగా అలవెన్సులు పై….ఆదాయపన్ను రియంబర్స్మెంట్ సింగరేణి యాజమాన్యం చెల్లించాలని డిమాండ్ఐ చేసారు,
బెల్లంపల్లి రామగుండం రీజియన్ కార్మికులకు స్వచ్ఛమైన త్రాగు నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా…
అందించాలని డిమాండ్ చేసినారు,
రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణి సంస్థకు రావాల్సిన 22వేల కోట్ల విద్యుత్ బొగ్గు బకాయిలను బేషరతుగా వెంటనే చెల్లించాలి, మెడికల్ కళాశాలకు సింగరేణి సంస్థ నుండి…
కేటాయించిన 500 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి సంస్థకు చెల్లించాలి అని డిమాండ్ చేశారు…యతిపతి సారంగపాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో … నాయకులు పేరం రమేష్, వడ్డేపల్లి కుమారస్వామి, పెండెం సత్యనారాయణ, సతీష్,సాయవేణి సతీష్ … నీలం రవి, యాదగిరి నరేష్, చిర్ర ఆంజనేయులు, శ్రీనివాస్, అబ్బోజి శివాజీ,ముదాం సత్తయ్య, అబ్బోజి శివాజీ తదితరులు పాల్గొన్నారు….

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *