ప్రధాని పర్యటనకు అధికారులు ఏర్పాట్లు!

ఎన్టిపిసి లోని హెలిపాడ్ గ్రౌండ్ పరిశీలిన..

నవంబర్ 12న ఆర్ ఎఫ్ సి ఎల్ ఎరువుల కర్మాగారని ప్రధాని నరేంద్ర మోడీ జాతి అంకితం చేయనున్న సందర్భంగా శనివారం కేంద్ర ఎరువుల రసాయన శాఖ కార్యదర్శి ఐఏఎస్ అరుణ్ సింఘాల్ కలెక్టర్ సంగీత సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం ఎన్టిపిసి సిజిఎం సునీల్ కుమార్, రామగుండం ఎరువుల కర్మాగారం జిఎం జా, ఎన్టిపిసి పర్మినెంట్ టౌన్షిప్ లోని మహాత్మా గాంధీ స్టేడియం లోగల హెలిప్యాడ్, ప్రధాని సభ ప్రాంగణం తో పాటు ఆర్ ఎఫ్ సి ఎల్ ఎరువుల కర్మాగారంలో ప్రధాని పర్యటన రూట్ మ్యాప్ ను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ రూపేష్ కుమార్, అఖిల్ మహాజన్, రామగుండం మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కణతల లక్ష్మీనారాయణ, రామగుండం తాసిల్దార్ జహేద్ పాషా, ఆర్ ఎఫ్ సి ఎల్ ఉన్నత అధికారులు, పలు విభాగాల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు………

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *