కంటి వైద్యశిబిరానికి భారీ స్పందన

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 19వ డివిజన్, పెంచికలపేట, న్యూ మారేడుపాక, పోతన కాలనీ పరిధిలో శుక్రవారం గోదావరిఖని కి చెందిన శ్రీకాంత్ కంటి దవాఖాన నిర్వాహకులు ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వాహకులు లక్కం బిక్షపతి, డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ తాళ్ల అమృతమ్మ రాజయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఉచిత కంటి, వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.సుమారు 200మందికి డాక్టర్ శ్రీకాంత్ వైద్యపరిక్షలు చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ, పేద ప్రజల సౌకర్యార్థం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంచికలపేట సర్పంచ్ కొండ వెంకటేష్, ఉప సర్పంచ్ లింగాల కుమార్ తో పాటు ఆర్ఎంపీ డాక్టర్లు రాజమౌళి, కె శంకర్, ఉదయ్ కుమార్, కే లింగయ్య, టి శంకర్, కె నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *