గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలి.

రామగుండం పోలీసు కమిషనర్ కార్యాలయంలో మంచిర్యాల ,పెద్దపల్లి జోన్ పోలీస్ అధికారులతో పాటు ఎక్సైజ్ అధికారులుతో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణ గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు, డిజిపి ఎం మహేందర్ రెడ్డి గార్ల ఆదేశాల మేరకు దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటిని యువతకు దూరం చేయాలనే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ….. అభివృద్ధికి అవరోధంగా గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు లేకుండా చేయ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. యువతను ప్రజలను రక్షించవలసిన బాధ్యత మన పైనే ఉందన్నారు. గంజాయి సేవించిన వ్యక్తి మత్తులో ఎన్నో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నందున ముందుగానే దాన్ని నిర్మూలించాలన్నారు. కమిషనరేట్ పరిధిలో వంద శాతం గంజాయిని నియంత్రించి గంజాయి రహిత కమీషనరేట్ గా మార్చడమే మనందరి ముందున్న లక్ష్యమని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా విధులు నిర్వహించి సమూలంగా డ్రగ్స్, గంజాయి నిర్మూలించాలి. గంజాయి పండించే వారిపై, రవాణా చేసే వారిపై, వ్యాపారం చేసే వారిపై మరియు తీసుకొనే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలవాటు ప్రకారం చేసే వారిని గుర్తించి పి‌డి ఆక్ట్ లు నమోదు చేయాలి.

 గంజాయి, గుడుంబా మరియు డ్రగ్స్ పైన పోలీస్ మరియు ఎక్సైజ్ అధికారులు కలసి సమన్వయం తో టీమ్ లు ఏర్పాటు చేసుకొని పని చేయాలి.

 స్కూల్ హెడ్ మాస్టర్ లు కళాశాల ప్రిన్సిపాల్ లు, ప్రజా ప్రతినిధులతో కలసి మీటింగ్ లు ఏర్పాటు చేసి తమ తమ ప్రాంతాలను డ్రగ్,గంజాయి , గుడుంబా రహిత ప్రాంతాలుగా మార్చుకోవాలని సూచించారు
👉 గతంలో మత్తు,డగ్స్ సంబంధించిన నేరాల్లో కేసులు నమోదు అయినటువంటి నిందితుల వివరాలు DOPAMS (Drug Offenders Profiling Analysis & monitoring Systems ) అనే వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇట్టి నిందితుల వివరాలు రాష్ట్రం మొత్తంలో ఎక్కడినుండైనా వారిని సెర్చ్ చేయవచ్చు.

 రోడ్డు రవాణా మరియు రైల్వే మార్గాలలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి.ఇంతకు ముందు ఈ విధమైన కేసులలో నేరస్తులపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి.

 ఇందుకోసం పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో గంజాయి మరియు గుట్కా రవాణాకు పాల్పడిన వ్యక్తుల సమాచారంతో పాటు గంజాయి సాగు చేసిన వ్యక్తుల, సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరాతీయడంతో పాటు, గంజాయి వినియోగించే వారి సమాచారాన్ని కూడా అధికారులు సేకరించాలి

 గంజాయి రవాణాకు పాల్పడేవారి సమాచారాన్ని తెలుసుకోనేందుకుగాను పతిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతో పాటు సమాచారం అందించిన వ్యక్తులకు నజారాలను అందించి వారి వివరాలను గోప్యంగా వుంచాలని,

 గంజాయి నియంత్రణలో ప్రతిభ కనబరిన అధికారులు, సిబ్బంది శాఖపరమైన గుర్తింపు ఇవ్వాలని, ముఖ్యంగా గంజాయి నియంత్రణ తాత్కాలికంగా కాకుండా శాశ్వతం నియంత్రించే మార్గాలపై అధికారులు దృష్టి పెట్టాలని, గంజాయి కట్టడకి పోలీస్ అధికారులు నైపుణ్యంతో కూడిన యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి

 అదే విధంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలేజీలపై దృష్టి సారించాలని, గంజాయి అమ్మకాలు, వినియోగం వలన జరిగే పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

 గంజాయి రవాణాకు పాల్పడిన నిందితులపై అవకాశాన్ని బట్టివారిపై పీడీయాక్ట్ లను నమోదు చేయడంతో పాటు గంజాయి నిందితుల నేరాలు కోర్టులో రుజువైయ్యే విధంగా నైపుణ్యంతో కూడిన దర్యాప్తుతో పాటు తగిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశ పెట్టాలని.

 స్టేషన్ అధికారులు ఎప్పటికప్పుడు తమ పరిధిలోని పాన్‌షాపులను తనీఖీ చేయాల్సి వుంటుంది. పాన్‌షాపుల్లో రోల్ పేపర్ అమ్మకాలకు పాల్పడే వారిపై కేసులను నమోదు చేయాలి

 నాకాబందీ, కార్డెన్ & సర్చ్ మరియు వెహికిల్ చెకింగ్ చేసే సమయం లో మత్తు పదార్థాల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన లేబర్ మరియు కంపెనీల్లో పని చేస్తున్న వారిపై నిఘా ఉంచాలన్నారు. ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థపై నిఘా ఉంచి అకస్మాత్తుగా వాహనాలు తనిఖీ చేయాలని సూచించారు

 పోలీసులు మత్తు పదార్థాలపై చేస్తున్న యుద్ధం కోసం అధికారులు మరియు ఇతర ప్రభుత్వ విభాగాల అధికారుల సమన్వయంతో విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారుబయట జిల్లాల నుండి పోలీసులు వచ్చి మన జిల్లాలో గంజాయి పట్టుకుని అరెస్టు చేసే పరిస్థితి రాకూడదని సూచించారు.

 యువత విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్ మత్తు పానీయాలకు అలవాటు పడకుండా తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన లేబర్ మరియు కంపెనీల్లో పని చేస్తున్న వారిపై నిఘా ఉంచాలన్నారు. ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థపై నిఘా ఉంచి అకస్మాత్తుగా వాహనాలు తనిఖీ చేయాలని సూచించారు. గంజాయి నిర్మూలన గురించి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

 గంజాయి సాగు ,సరఫరా ,సేవించడం చేసే వారి సమాచారం తెలిస్తే 9440900683 నెంబర్,డయల్100,స్థానిక పోలీస్ అధికారులకు సమచారం అందించినట్లు ఐతే సమచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అన్నారు. చట్టవ్యతిరేకంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *