మున్సిపల్ తుక్కు దొంగల పై మరో ఫిర్యాదు

పాత పాత మున్సిపల్ కార్యాలయం లోని పాతఇనుము మాయం లో పాత్రధారుల పై చర్యలు తీసుకోవాలని వైయస్సార్ టీపీ పెద్ద పెల్లి పార్లమెంట్ కన్వినర్ జిమ్మిబాబు ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రాజ్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిమ్మీబాబు మాట్లాడుతూ గోదావరి ఖని ప్రాంతంలో నేరపూరిత సామాజిక సమస్య ప్రభలుతుందని, పాత రామగుండం మున్సిపల్ కార్యాలయంలో లక్షల రూపాయల విలువైన పాత ఇనుము తుక్కు మాయమైందని, ఈ బాగోతంలో లో అధిక పార్టీలో ఉన్న కొందరు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉన్నట్లు కోడై కూస్తుందని, దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులే నిందితులుగా భావించాల్సి వస్తుందని వైఎస్ఆర్ టీపి నాయకులు భావిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో పోలీసులు నిగ్గు తేల్చాల్సింది గా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. లేనియెడల ఈ సమస్య పరిష్కారం కోసం డిజిపిని సంప్రదిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓయల్ రెడ్డి, శాంసన్, రాజు, దబ్బెట చరణ్, మహేందర్, వెంకటేష్, బానేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *