సింగరేణి కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ!

సింగరేణి ప్రైవేటీకరణ చేసేందుకు పోటాపోటీగా కుట్రలు చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు కార్మికవర్గం సిద్ధంగా ఉండాలని రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ MS రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ పిలుపునిచ్చారుసింగరేణి గనుల పర్యటనలో భాగంగా GDK టూ A గని పై కాంగ్రెస్ ప్రతినిధులు భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా గనిలో పని చేస్తున్న కార్మికులను కలుసుకుని యాజమాన్యం పరంగా వారికి అందుతున్న వసతులపై. అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే వెలుగులను అందించేందుకు దోహదపడే బొగ్గు ఉత్పత్తి సాధన కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేస్తున్నా సింగరేణి కార్మికుల సేవలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలిపారు.

సింగరేణి కార్మికుల గౌరవాన్ని పెంపొందించేందుకు కాంగ్రెస్ పార్టీ విస్తృతమైన కార్యక్రమాలను చేపట్టను౦దని ఆయన వెల్లడించారు సింగరేణి గనుల ను ప్రైవేటీకరణ నుండి కాపాడుకునేందుకు జరిగే ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందని ఆయన తెలిపారు. …___ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు బొంతల రాజేష్ మహంకాళి స్వామి కాల్వ లింగస్వామి పెద్దల్లి ప్రకాష్ ఎం డి ముస్తఫా ఫక్రుద్దీన్ యుగేందర్ విజేందర్ మహేష్ రమేష్ కొప్పుల శంకర్ నాయిని ఉదయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *