మహిళలకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యం

రామగుండం నియోజకవర్గం లోని పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పనే విజయమ్మ ఫౌండేషన్ లక్ష్యమని విజయమ్మ ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు కోరుకంటి ఉజ్వల అన్నారు. గోదావరిఖని పట్టణం బస్టాండ్ కాలనీలోని విజయమ్మ పౌండేషన్ మహిళ సాధికారత ప్రధాన కేంద్రం ప్రధాన కార్యాలయంలో మహిళలు మగ్గం వర్క్ భ్యూటిషన్ ప్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ లో శిక్షణను ప్రారంభించారు. అనంతరం కోరుకంటి ఉజ్వల గారు మాట్లాడుతూ… మహిళలు విజయమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో కార్పోరేటర్ కలువల శీరిష సంజీవ్ కో ఆప్షన్ సభ్యురాలు తస్నీంభాను జహిద్ పాషా విజయమ్మ పౌండేషన్ కో ఆర్డినేటర్ ఎడెల్లి శ్యాం, సిద్దు టైనర్స్ సత్యవతి కవిత శ్రీదేవి రజిత పాల్గొన్నారు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *