గౌడ కులస్థుల కు తగిన ప్రోత్సాహం!

ప్రభుత్వం అందిస్తుందని… హరిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.

గురువారం అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో ఐదు వేల ఈత మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యేగారు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రాన్ని అకుపచ్చమయంగా మార్చేందుకు సిఎం కేసీఆర్‌ గారి తెలంగాణ కు హరితహారం అనే గోప్ప కార్యక్రమన్ని చేపట్టారని అన్నారు. మెుక్కలు నాటడం మనందరి బాధ్యతని ప్రతి ఒక్కరు తమ విధిగా మెుక్కలు నాటి వాటి సంరక్షణ చేయాలన్నారు. రాష్ట్రంలోని గౌడ కులస్థులు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందన్నారు. గౌడ సంఘ సోసైటి భూముల్లో ఈత ఖర్జూర మెుక్కలు నాటడం జరుగుతుందని తద్వారా వారికి ఉపాధి దోరికే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం జడ్పీటిసి అముల నారాయణ ఎంపీటీసీ కోలిపాక శరణ్య నాయకులు కోలిపాక మధుకర్ రెడ్డి ఎంపీడిఓ యాదగిరి తదితరులు పాల్గొన్నారు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *