వెంకటేశ్వర ఆలయంలో సుదర్శన హోమం!

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో శ్రీపాద క్షేత్ర రామునిగుండ్ల కొండపైన వెంకటేశ్వర ఆలయాన్ని అభినవ తిరుమల తరహ తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం నాడు శ్రీపాద క్షేత్ర రాముని గుండాల కొండ పైన వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ ఆవరణలో సుదర్శన హోమం చెపట్టి యంత్ర స్దాపనను ఎమ్మెల్యే చెపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… స్వామివారి ఆలయ నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా సుదర్శన్ హోమాన్ని చేపట్టామని తెలిపారు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దిగ్విజయంగా పూర్తి కావాలని…స్వామివారు రామగుండం నియోజకవర్గం ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని తమకు ప్రసాదించాలన్నారు… ఈ కార్యక్రమంలో నాయకులు బోడ్దుపల్లి శ్రీనివాస్ ,ఇసంపల్లి తిరుపతి తిరుపతి నాయక్, గోలివాడ ప్రసన్న కుమార్ ఆలయ బాధ్యులు మేడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *