భైరం శంకర్ గుండెపోటుతో మృతి.

గోదావరిఖని సింగరేణిలో సీనియర్ కార్మిక నాయకుడు టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర శ్రమశక్తి అవార్డు గ్రహీత బైరం శంకర్ సోమవారం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి సాయంత్రం కరీంనగర్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి కార్మిక వర్గానికి తీరనిలోటని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి, టిఎన్టియుసి సింగరేణి కార్మిక వర్గానికి ఎనలేని సేవలు చేశారని ఆయన మృతి పట్ల రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తిని నరసింహులు, టిఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎంకె బోస్, సింగరేణి టిఎన్టియుసి అధ్యక్షులు రత్నాకర్ రావు, మోహన్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *