తెరాస సమన్వయ కమిటీ సభ్యుడిగా దాసరి నియామకం

రామగుండం నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులుగా దాసరి శ్రీనివాస్ ను రామగుండం ఎమ్మెల్యే, తెరాస పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ బుధవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో రామగుండం నగర కార్పొరేషన్ విద్యార్థి నాయకుడిగా, విద్యార్థి విభాగంలో రాష్ట్ర కార్యదర్శి గా, విద్యార్థులను ప్రజలను చైతన్య పరుస్తూ, విద్యార్థులను ఉద్యమ కెరటాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రస్థాయి ఉద్యమ సదస్సు నిర్వహించే ప్రతి అంశంలో ముందున్నారు. కెసిఆర్ ఇచ్చిన ప్రతి పిలుపును తూచా తప్పకుండా పనిచేస్తూ, రామగుండం నియోజకవర్గంలో ఉద్యమ నాయకుడు కోరుకంటి చందర్ అన్న వెంట నడుస్తూ ఉద్యమానికి ఊపిరి పోసిన, దాసరి శ్రీనివాస్ కు నియోజకవర్గ స్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేసేందుకు సమన్వయ కమిటి సభ్యుడిగా నియామకం కావడంపట్ల పలువురు ఉద్యమకారులు, పార్టీ శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా దాసరి శ్రీనివాస్ గురువారం మాట్లాడుతూ, తనపై నమ్మకంతో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడిగా నియమించినందుకు ఉద్యమ నాయకుడు ఎమ్మెల్యే చందరన్న కు, నగర మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, సీనియర్ తెరాస నాయకులు పాత పెల్లి ఎల్లయ్య, గంగానగర్ పట్టణ అధ్యక్షులు అచ్చేవేణు, ప్రెస్ ఇంచార్జ్ అడప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *