39 డివిజన్ ప్రధాన రహదారి ని పట్టించుకోని ప్రజా ప్రతినిధులు!

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 39 డివిజన్ లోని ఎన్ టి పి సి రింగ్ రోడ్ నుండి ఆర్ ఎఫ్ సి ఎల్ వైపు వెళ్లే రహదారి పనులను మధ్యలోనే ఆగిపోయాయి. గత్యంతరం లేక ఇదే రహదారిపై వాహనదారులు నిత్యం ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది . రోడ్డు పనులు పూర్తి చేయాల్సిన కాంట్రాక్టర్ మధ్యలో ఆప వేయడంతో తో వాహనాల రాకపోకలతో పెద్ద ఎత్తున దుమ్ము లేవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, వాహనదారులు కంటి జబ్బులు, శ్వాసకోస ఇతర అనారోగ్యాల పాలవుతున్నారు. అంతేకాకుండా ప్రమాదాలు జరిగిన సంఘటనలు సైతం ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. అసలు రోడ్డు పనులు మధ్యంతరంగా ఆగిపోవడానికి గల కారణాలు ఏమిటో ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఎప్పటికీ ఈ రహదారి పూర్తవుతుందో అని ఆశగా ఎదురు చూస్తున్న స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *