ఒక్కో సింగరేణి కార్మికునికి సగటున రూ. 1,15000..

కాయ కష్టం చేసి , రెక్కలు ముక్కలు చేసుకొని భూమి అడుగు భాగాన ఉన్న బొగ్గు పొరల్ని తొలగిస్తూ రాష్ట్రంతోపాటు దేశానికి వెలుగులను అందిస్తున్న సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు పంపింది…రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు ప్రకటించిన 29 శాతం లాభాల బోనస్ సొమ్మును కార్మికులకు ఈ నెల 11వ తేదీన చెల్లించనున్నట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. నవంబర్ 1న దీపావళి బోనస్, ఈ నెల 8న పండుగ అడ్వాన్స్ను చెల్లించనున్నట్లు చెప్పారు. లాభాల బోనస్ రూ. 79.07 కోట్లు, దీపావళి బోనస్ రూ. 300 కోట్లు సింగరేణి సంస్థ చెల్లిస్తుందన్నారు. దీపావళి బోనస్ కింద ప్రతీ కార్మికుడు రూ. 72,500 అందుకోనున్నారని సీఎండీ వెల్లడించారు. రెండు బోనస్ చెల్లింపునకు సింగరేణి 379.07 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. సింగరేణి సంస్థ పండుగ అడ్వాన్స్ కింద ప్రతి కార్మికుడికి రూ.25 వేలు ప్రకటించిందని.. ఈ డబ్బును ఈ నెల 8న చెల్లించనుందని సీఎండీ శ్రీధర్ తెలిపారు. రెండు రకాల బోనస్లు, పండుగ అడ్వాన్స్ కలిపి ఒక్కో కార్మికుడు సగటున సుమారు రూ.1.15 లక్షల వరకు అందుకోనున్నట్లు సీఎండీ చెప్పారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *